పొలాల్లో అటవీ పెంపకమును ఒక సుస్థిర నమూనాగా చేయు దిశగా IPAndhra Paper Limited మరొకముందడుగు వేసి,రైతుల ఆసక్తులు సంరక్షించబడడమే అందుకు కావలసిన ముందస్తు అవసరమని అది అర్థం చేసుకొంటోంది. మార్కెట్ లోని ఏదేని వ్యవసాయోత్పాదన, దాని పంపిణీ మరియు డిమాండు సమీకరణానికి సంబంధించి ఉంటుంది. రైతు యొక్క నిఖరాదాయము ఎప్పటికీ నిర్ధారించబడలేదు మరియు ప్రతికూల పరిస్థితులనేవి రైతు యొక్క జీవితములో అసాధారణమేమీ కాదు. కలప గుజ్జు రైతులు ఇందుకు అతీతమేమీ కాదు. అయినప్పటికీ, IPAndhra Paper Limited దానిని ఒక తీవ్రమైన అంశముగా తీసుకొని, తనకు గల అతి పరిమిత వనరులతో సాధ్యమైనంత వరకూ ఈ నమూనా యొక్క సుస్థిరత్వానికి దోహదపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇది“రైతు కోసం స్మార్ట్ కార్డు”అనబడే పథకాన్ని ప్రవేశపెడుతోంది. ఇది సంపూర్ణంగా స్వచ్ఛంద పథకము. కలప గుజ్జు సాగు కోసం IPAndhra Paper Limited, రైతులు అధిక దిగుబడిని పొందుటకై అనుసరించదగిన అత్యుత్తమ అభ్యాసాలను బోధిస్తోంది. పొలములో నిర్దిష్టమైన అభ్యాసాన్ని పాటించే రైతులకు ఈకార్డుజారీ చేయబడుతుంది. ఈకార్డుకంపెనీయొక్క డేటా బేస్ యందలి GPS సమన్వయ రికార్డింగులతో పాటుగా రైతుమరియు అతని ప్లాంటేషన్ యొక్క వివరాలనుకలిగియుంటుంది. IPAndhra Paper Limited CPC నుండి రైతు కొనుగోలు చేసిన నారు మొక్కల సంఖ్యతో పాటుగా ముందస్తుగా పేర్కొనబడిన ఒక ఋణ విధానము అందులో అనుసంధానమై ఉంటుంది. ఈ ఋణ సౌకర్యము యొక్క ప్రయోజనము, IPAndhra Paper Limited CPC నుండి తర్వాతి విడతలో అదే GPS సమన్వయ విస్తీర్ణము కొరకు నారు మొక్కలను తిరిగి కొనుగోలు చేసుకొనేటప్పుడు అందుకోబడుతుంది.
ఆ తర్వాత, ఒక నిర్దిష్టవ్యవధి 3.5 సంవత్సరాల తదనంతరము IPAndhra Paper Limited కు అమ్మకానికై అతడు కలపను తీసుకొని వచ్చినప్పుడు, ఈ కార్డుస్కాన్ చేయబడి, అతడు తన ప్లాంటేషన్ నుండి తెచ్చిన కలప పరిమాణము నమోదు చేయబడుతుంది. ఈ కార్డులు నేరుగా లబ్దిదారు రైతు యొక్క బ్యాంకు ఖాతాతో అనుసంధానము చేయబడతాయి. అందువల్ల, రైతుకు చేయవలసి యున్న ధనరూపములోని ప్రయోజనము (ఏదైనా ఉన్నచో) ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయమునకుఅవకాశం కల్పించకుండానే నేరుగా రైతు యొక్క ఖాతాకు బదిలీ చేయబడుతుంది. అదే సమయములో, కార్డుల వల్ల రైతులకు ఎటువంటి ఖర్చూ కాదు కానీ, తమకున్న భూముల నుండి అత్యుత్తమ దిగుబడిని పొందే విధంగా స్వంత ప్రయోజనాల కోసం వారు తమ పొలములో అత్యుత్తమ అభ్యాసాలను పాటించవలసి ఉంటుంది.
జవాబు: ఇది,IPAndhra Paper Limited యొక్క సభ్య రైతులను గుర్తించి IPAndhra Paper Limited తో దీర్ఘకాలిక ప్రాతిపదికపై అనుసంధానమయి ఉంటూసరుగుడు క్లోన్లను పెంచే వారికి ఇంటర్నేషనల్ పేపర్ Andhra Paper Limited నుండి అందించబడే సభ్యత్వపు కార్డు.
జవాబు: రాజమండ్రిలో గానీ లేదా ములగపూడిలో గానీ నెలకొల్పబడిన IPAndhra Paper Limited క్లోనల్ ఉత్పత్తి కేంద్రాలు (CPC) నుండి రైతు సరుగుడు క్లోన్లను కొనుగోలు చేసి, వాటిని రాజమండ్రిలోని IPAndhra Paper Limited మిల్లుకు 100 కి.మీ పరిధి లోపున నాటుతారు. దానితో పాటుగా, వారు మొక్కకు మరియు మొక్కకు మధ్య దూరం 2.5 మీటర్లు (వరుసల మధ్య) x 1 మీటరు (ఒక వరుసలోని మొక్కల మధ్య) ఉండేట్లుగా పాటిస్తారు, మరియు IPAndhra Paper Limited చే సలహా ఇవ్వబడిన ఇతర సాంకేతిక మార్గదర్శకాలను కూడా పాటిస్తారు.
జవాబు: లేదు. మొదటగా జారీ చేసేటప్పుడు దీనిని ఉచితంగా ఇస్తారు. అంతే కాకుండా ఇది పూర్తిగా ఒక స్వచ్ఛంద పథకము.ఈ కార్డును తీసుకోవాలా లేదా అని నిర్ణయించుకోవడానికి రైతుకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. అతడు ఈ కార్డును గనక ఎంచుకొని, అతని ప్లాంటేషను అన్ని ప్రాతిపదికలనూ (పై ప్రశ్న 2 పేర్కొన్నట్లు) నెరవేర్చినట్లుగా IPAndhra Paper Limited టీము కనుగొన్నట్లయితే, ప్లాంటేషన్ స్థలమును భౌతికంగా పరిశీలించిన మీదట ఆ రైతు తనంతట తానుగా ఈ కార్డును పొందుతారు.
జవాబు: అవును. మొక్కలునాటిన తేదీ నుండి కలప అమ్మకాని కోసం 3.5 సంవత్సరాల తర్వాత ఈ కార్డు దానంతట అదే యాక్టివేట్ అవుతుంది మరియు ఆ యాక్టివేషన్ వ్యవధి తర్వాతి 1 సంవత్సరం పాటు కొనసాగుతుంది. అంటే, ఒకవేళ ఒక రైతు 2015 ఆగస్టులో గనక క్లోన్లను నాటినట్లయితే, కలప అమ్మకం కోసం అతని కార్డు 2019 ఫిబ్రవరి 1 వ తేదీనాడు యాక్టివేట్ అయి, 2020 జనవరి 31 వ తేదీ వరకూ యాక్టివేషన్ కొనసాగుతుంది.
జవాబు: IPAndhra Paper Limited CPC నుండి క్లోన్లను కొనుగోలు చేసిన మీదట, సంబంధిత ఋణాలు కార్డుకు కేటాయించబడతాయి. 3.5 సంవత్సరాల తర్వాత, రైతు కలపను కోసి దానిని IPAndhra Paper Limitedకు అమ్మునప్పుడు, దానిని నేరుగా మిల్లులకు సరఫరా చేయునప్పుడు అతడు కార్డును తీసుకొని రావాల్సి ఉంటుంది, లేదా మిల్లు యొక్క వే బ్రిడ్జి వద్ద కార్డును స్వైపింగ్ చేసి, అతడు పంపిన కలప పరిమాణమును అప్ లోడ్ చేసుకోవడానికై మిల్లుకు కలపను తరలించే ప్రతియొక్క వాహనము వెంబడి దానిని పంపించవలసి ఉంటుంది. తన ప్లాంటేషన్ విస్తీర్ణము (ఎకరాలలో విస్తీర్ణము ఆధారంగా) నుండి ఆశించబడే కనీస దిగుబడి పరిమాణము పూర్తి కాగానే, ఆ ఆశించిన పరిమాణము కొరకు అయిన ఋణాలు అతని కార్డుకు కేటాయించబడతాయి.
జవాబు: కలప కోత పూర్తి కాగానే, రైతు తన కార్డును, తాను చివరి సారి క్లోన్ మొక్కలను కొనుగోలు చేసిన CPC ఇన్-చార్జ్ (బాధ్యులు) వద్దకు తీసుకు వస్తారు. అక్కడ అతడు తన కార్డును చూపి, తర్వాతి విడతకై క్లోన్ మొక్కలను మళ్ళీ కొనుగోలు చేస్తారు. IPAndhra Paper Limited యొక్క క్షేత్ర సిబ్బంది అతని తాజా ప్లాంటేషన్ విడతను సందర్శించి, అతడు మళ్ళీ మొక్కలను నాటియున్నట్లుగా నిర్ధారణ చేసినప్పుడు, పొందిన ఋణాల ఆధారంగాఅంతకు మునుపటి విడతకు సంబంధించిన ప్రయోజనాలను పొందుటకై అతని కార్డు అర్హత పొందుతుంది.
జవాబు: ఈకార్డుతో రైతు యొక్క బ్యాంకు ఖాతా నేరుగా అనుసంధానము చేయబడుతుంది. కలపను అందుకొన్న తర్వాత, మార్కెట్ యొక్క స్థితిని విశ్లేషణ చేయడం మరియు సభ్యులైన రైతులకు అవసరమయ్యే మద్దతును నిర్ణయించడమనేది IPAndhra Paper Limited యొక్క విచక్షణపై ఆధారపడి ఉంటుంది. దాని ఆధారంగా ఒక్కో క్రెడిట్ పాయింటుకు అందే ప్రయోజనాన్ని IPAndhra Paper Limited నిర్ధారిస్తుంది. అది నేరుగా రైతు యొక్క ఖాతాలోనికే వెళ్ళి జమ అవుతుంది.
జవాబు: లేదు. ఆ సమయములో ఉన్న మార్కెట్ ధర ఆధారంగారైతు తాను స్వంతంగా నిర్ణయం తీసుకొని కలపను ఏ పరిశ్రమకయినా అమ్ముకోవచ్చు.
జవాబు: కలపను అమ్మినందువల్ల వచ్చే క్రెడిట్ పాయింటును ఈ కార్డులో అతడు పొందలేడు, మరియు అతని కార్డు మరే ఇతర ప్రయోజనానికీ అర్హత పొందజాలదు.